ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 31 Mar 2010, IST
ఇవి ఒకరకమైన సూక్ష్మజీవులు. స్వయంగా పునరుత్పత్తి కాలేవు. కానీ, ఏదైనా జీవకణంలోకి ప్రవేశించినపుడు పునరుత్పత్తి కాగలవు. వీటిలో పునరుత్పత్తికి అవసరమయ్యే పదార్థం (డిఎన్ఎ) చుట్టూ మాంసకృత్తుల పూత ఉంటుంది. జీవకణంలో ప్రవేశించి, కేంద్రకంలోకి వెళ్లిన తర్వాత ఇవి పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. కేంద్రకంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్ కాపీలు జీవకణం పగిలేంతవరకూ తయారవుతూనే ఉంటాయి. ఇలా జీవకణం పగిలి, విడుదలైన వైరస్లు ఇతర జీవకణాలను దాడి చేసి లోపలికి ప్రవేశించి, పునరుత్పత్తిని కొనసాగిస్తాయి. ఈ ప్రక్రియతో వ్యాధి వస్తుంది. కణతులు లేదా గడ్డలు ఏర్పడతాయి. బ్యాక్టీరియాల మాదిరిగా వైరస్లను యాంటీబయాటిక్ మందులు చంపలేవు. కానీ, వైరస్ వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి ఇటీవల టీకా మందులు వచ్చాయి. బలహీనంగా ఉన్న రోగ సూక్ష్మజీవుల నుండి టీకా మందులను తయారు చేస్తు న్నారు. అప్పుడు యాంటీబాడీలు శరీరంలోనే ఉత్పత్తవుతాయి. వైరస్ రోగ వ్యాప్తి నివా రణకు 'గార్డాసిల్, సర్వారిక్స్ టీకా మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటిని 'మానవ పాపిలోమా వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్)' టీకాలు అంటారు. జలుబు చేసిన సమయంలో వైరస్లు దాడి చేసి వ్యాధిని కలిగించవచ్చు. జలుబు ఇబ్బందిని కలిగించినప్పటికీ ఇది తీవ్రమైన వ్యాధి కాదు. జలుబు ముట్టుకోవడం ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. దగ్గడం, తుమ్మడం ద్వారా వ్యాపించదు. జలుబుకు మందు లేదు. రెండొందలకన్నా ఎక్కువ వైరస్లు జలుబును కలిగిస్తున్నాయి. జలుబు వచ్చి నప్పుడు ఏ మందు తీసుకోకున్నా మన శరీరంలోనే యాంటీబాడీలు ఉత్పత్తయ్యి వారంరోజుల్లో తగ్గిపోతుంది.
No comments:
Post a Comment